వర్షం నింపిన విషాదం.. ఇద్దరు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : గత రెండు రోజులుగా తెలుగు రాష్టాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఏపీలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్లితే.. అనంతపురం జిల్లాలో వాన బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు వాగులు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని చిన్నపల్లి చెరువు తెగిపోవడంతో ఓదులపల్లి వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కదిరి పులివెందుల ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తలుపుల మండలం గొల్లపల్లి వద్ద కదిరి నుంచి విజయవాడ‌కి […]

Update: 2021-09-03 01:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గత రెండు రోజులుగా తెలుగు రాష్టాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఏపీలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్లితే.. అనంతపురం జిల్లాలో వాన బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు వాగులు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని చిన్నపల్లి చెరువు తెగిపోవడంతో ఓదులపల్లి వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కదిరి పులివెందుల ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తలుపుల మండలం గొల్లపల్లి వద్ద కదిరి నుంచి విజయవాడ‌కి వెళ్తున్న కారు వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ వరద ప్రవాహంలో బీఫార్మసీ విద్యార్థి బాబ్జాన్, డ్రైవర్ రఫిక్ గల్లంతయ్యారు. బాబ్జాన్ మృతదేహం లభ్యం కాగా, రఫీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News