భార్యకు వీడియో కాల్ చేసి హరికేన్ ప్రభావం చూపించిన విరాట్(వీడియో వైరల్)

టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించిన టీమిండియా 13 ఏళ్ల‌ తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది.

Update: 2024-07-03 09:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించిన టీమిండియా 13 ఏళ్ల‌ తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. మ్యాచ్ ముగిసి నాలుగైదు రోజులు అవుతున్నా ఇప్ప‌టికీ భార‌త జ‌ట్టు బార్బడోస్‌లో ఉంది. బెరిల్‌లో హరికేన్ ప్రభావంతో ఆదివారం నుంచి భార‌త‌ జట్టు మొత్తం బార్బడోస్ హోటల్‌లోనే ఉండిపోయారు. ఈక్రమంలో జట్టుతో పాటు హోటల్‌లో ఉన్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేసి అక్కడి హరికేన్ పరిస్థితిని చూపించారు. విరాట్ త‌న భార్య‌ అనుష్క శర్మకు వీడియో కాల్‌లో తుఫాను తాలూకు భయంకరమైన దృశ్యాల‌ను చూపిస్తున్నారు.

సముద్రానికి ఎదురుగా ఉన్న రిసార్ట్‌లో బస చేసిన‌ విరాట్ కోహ్లీ దాని బాల్కనీలో నిలబడి, వీడియో కాల్‌లో అనుష్క శర్మకు బలమైన అలలు, గాలులను చూపించ‌డం వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో బెరిలో హరికేన్ ప్రభావంతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన భారత క్రికెటర్లు రేపు ఇండియాకు బయలుదేరనున్నట్లు సమాచారం. హరికేన్ ప్రభావంతో మన క్రికేటర్లు రెండు రోజులుగా హోటల్‌లోనే ఉంటున్నారని తెలియజేశారు. విమానాశ్రయాన్ని సైతం మూసేశారు. తాజాగా ఆ ఎఫెక్ట్ కొంచెం తగ్గడంతో రేపు తెల్లవారుజామున ఇండియాకు బయలుదేరనున్నారు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.



Similar News