Viral: పొలం దున్నుతుంటే బయటపడ్డ మట్టి పాత్ర.. లోపల ఉన్నవాటిని చూసి బిత్తరపోయిన కూలీలు(వీడియో)

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ నలుమూలల జరుగుతున్న విషయాలను ఇంట్లో కూర్చోనే తెలుసుకుంటున్నాము.

Update: 2024-09-14 07:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ నలుమూలల జరుగుతున్న విషయాలను ఇంట్లో కూర్చోనే తెలుసుకుంటున్నాము. అలాగే దీన్ని బేస్ చేసుకుని చాలా మంది ఫేమస్ కూడా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

పూర్వకాలంలో బ్యాంకులు లేని సమయంలో ప్రజలు తమ ఆభరణాలను భద్రంగా ఉంచుకోవడానికి వాటిని భూగర్భంలో పాతిపెట్టేవారు. అలా నగలను పాతిపెట్టిన వ్యక్తి చనిపోతే అవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియకుండా పోయేది. ఇక కొన్నాళ్ల తర్వాత తవ్వకాల్లో ఆ వస్తువులు దొరికేవి. అప్పుడు వాటి గురించి మనకు తెలిసేది. ఇలాంటి వార్తలు మనం చాలా సార్లు వినే ఉంటాము. ప్రస్తుతం ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

@dubai__vloger2024 అనే వీడియోలో ఇద్దరు కూలీలు ఉన్నారు. వారిలో ఒక కూలీ పొలాన్ని పారతో దున్నుతుండగా మరొకరు ట్రాక్టర్ నడుపుతున్నాడు. అకస్మాత్తుగా ఒక కూలీ ట్రాక్టర్ కల్టివేటర్ దగ్గర కుండ పడి ఉండడం చూశాడు. వెంటనే దాన్ని తీసుకుని అందులో ఏముందో చూడమని మరో కూలీని అడుగుతాడు. దీంతో మరో కార్మికుడు ఈ కుండపై కట్టిన గుడ్డను తీసివేయగానే అందులో నుంచి ఆభరణాలు బయటకు వచ్చాయి. అతను వెంటనే ఆ నగలను కవర్ చేస్తాడు. ఇంతలో మూడో కూలీ అక్కడికి వచ్చి కుండ చూపించమని డిమాండ్ చేయడం ప్రారంభించాడు. కానీ, ఫస్ట్‌లో ఆ ఇద్దరు కార్మికులు మూడో వ్యక్తికి అందులో ఏమున్నదో చూపించరు. చివరికి ఎలాగోలా కుండ లోపల ఉన్న నగలు చూసి.. వాటిలో సగం డిమాండ్ చేయడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఒక ఆభరణాన్ని తీసి అతనికి ఇస్తారు. అక్కడితో ఆ వీడియో ముగుస్తుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు.. ఇదంతా స్క్రిప్టెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to dubai__vloger2024 instagram id)


Similar News