Trending: రెంట్ కట్టలేదని ఏకంగా SBI ఏటీఎం సెంటర్కు తాళం.. నెట్టింట్లో ఫొటోలు వైరల్
‘ఎస్బీఐ’ కోట్లాది మంది ఖాతాదారులు ఆ బ్యాంకు సొంతం.
దిశ, వెబ్డెస్క్: ‘ఎస్బీఐ’ కోట్లాది మంది ఖాతాదారులు ఆ బ్యాంకు సొంతం. నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు నడిపే సంస్థకు ఓ సామాన్యుడు షాకిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ పట్టణంలో కొన్నాళ్ల నుంచి ఎస్బీఐ ఓ ఏటీఎం సెంటర్ను రన్ చేస్తోంది. ఈ మేరకు ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి షెటర్ అద్దేకు తీసుకుని ఏటీఎంను రన్ చేస్తున్నారు. అయితే, కొన్నాళ్ల నుంచి బ్యాంకు వారు సదరు షటర్ యజమానికి అద్దె చెల్లించడం లేదు. దీంతో అతడు బ్యాంకు వెళ్లి వాకబు చేసినా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ క్రమంలో చిర్రెత్తుకొచ్చిన యజమాని ఏకంగా ఎస్బీఐ ఏటీఎంకు తాళం వేశాడు. పైగా ఏటీఎం బయట ‘అద్దె చెల్లించనందుకు ఏటీఎం మూతపడిందని’ అంటూ నోటీసు కూడా అంటించాడు. అది చూసిన జనం.. ఇదెక్కడి మాస్ రా మామ అంటూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.