Trending: అప్పుడే పెళ్లి చేసుకుంటాం.. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ప్రకటన

దువ్వాడ ఫ్యామిలీ పంచాయతీ ఆ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2024-10-07 14:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: దువ్వాడ ఫ్యామిలీ పంచాయతీ ఆ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas), దివ్వెల మాధురి (Divvela Madhuri)తో కలిసి తమ ఇంట్లో అక్రమంగా ఉంటున్నారని ఆయన సతీమణి దువ్వాడ వాణి (Duvvada Vaani) ఆరోపించారు. ఈ క్రమంలో వారు టెక్కలి (Tekkali)లోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వాణి తన కూతుళ్లు, తండ్రితో కలిసి అక్కడే బైఠాయించారు. అయితే, ఆ వివాదం అలా కొనసాగుతుండగానే తాజాగా ఆ ప్రేమ జంట తిరుమలలో ప్రత్యక్ష్యమైంది.

సోమవారం వారు వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి దగ్గర మాధురి షూట్ కొనసాగింది. ఈ క్రమంలోనే వారు పెళ్లిపై సంచలన ప్రకటన చేశారు. కోర్టు కేసులు అన్ని ముగిశాక త్వరలోనే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. అప్పటి వరకు తాము కలిసే ఉంటామని దివ్వెల మాధురి తెలిపింది. రెండేళ్లుగా మాధురితోనే కలిసి ఉంటున్నానని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కోర్టు కేసులే క్లియర్ అయ్యాక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని క్లారిటీ ఇచ్చారు.


Similar News