ఈ హీరోయిన్ కొడుకు ముఖేష్ అంబానీ మనవడి స్కూల్లో చదువుతున్నాడా? పిల్లలతో నీతా అంబానీ పిక్స్ వైరల్

Update: 2024-10-07 08:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడైన ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈవిడ కుటుంబ బాధ్యతల విషయంలో చాలా చక్కగ వ్యవహరిస్తారు. అంతేకాకుండా అందరిపట్ల ప్రేమగా మెలుగుతారు. అయితే నీతా అంబానీ తాజాగా తన మనవడు పృథ్వీ చదువుతోన్న పాఠశాలకు వెళ్లారు. స్కూళ్లోకి వెళ్లిన నీతా తన మనవడితో పాటు మిగతా విద్యార్థులతో కూడా ముచ్చటించారు. ఇకపోతే హీరోయిన్ కరీనా కపూర్ కొడుకు కూడా జహంగీర్ జెహ్ అలీ ఖాన్ కూడా పృథ్వీ క్లాసులోనే చదువుతున్నట్లు తెలుస్తోంది.

సింపుల్ పింక్ల కలర్ డ్రెస్‌లో అక్కడికెళ్లినా నీతా అంబానీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోల్డెన్ ఎంబ్రాయిడరీతో అలంకరించిన కుర్తా చూడానికి ఎంతో బాగుంది. ఫుల్ స్లీవ్స్, గోల్డెన్ బోర్డర్స్ తో సీక్విన్ వర్క్ తో అందంగా తయారుచేశారు. ఫిట్ గా లేకుండా రిలాక్స్ ఫిట్‌తో చక్కగా ఉంది. మ్యాచింగ్ ప్యాండ్ ప్యాంట్, మ్యాచింగ్ ఆర్గాంజా దుపట్టాతో నీతా జనాల్ని ఆకట్టుకుంటున్నారు. అలాగే చెవులకు డైమండ్ రింగ్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం నీతా అంబానీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Similar News