Trending: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. రైల్వే ట్రాక్‌పై తేలియాడుతున్న భారీ చేపలు

ముంబై మహా నగరంపై వరుణ దేవుడు విరుచుకుపడ్డాడు.

Update: 2024-07-10 03:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముంబై మహా నగరంపై వరుణ దేవుడు విరుచుకుపడ్డాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అక్కడ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే వారు ఇళ్లలోనే ఉంటున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసిన వరద నీరు దర్శనమిస్తోంది. రుతు పవనాలు మరింత బలపడటంతో మరో రెండు రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ముంబై నగరంతో పాటు థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి ఏరియాల్లో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై భారీ ఎత్తున నీరు చేరింది. అయితే, ఆ నీటిపై భారీ చేపలు తేలియాడుతూ కనిపించాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది. 

వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://x.com/TeluguScribe/status/1810851632692822171


Similar News