Trending: బెంగళూరు మెట్రో స్టేషన్లో దారుణం.. పట్టపగలే యువకుడి ఆత్మహత్యాయత్నం
ఓ యువకుడు పట్టపగలే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బెంగళూరు పట్టణంలోని జ్ఞాన భారతి మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: ఓ యువకుడు పట్టపగలే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బెంగళూరు పట్టణంలోని జ్ఞాన భారతి మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ్ అనే యువకుడు కొన్నాళ్ల నుంచి అర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఉపాధి కోసం బెంగళూరు నగరానికి వచ్చినా అతడికి ఏ పని దొరక్కపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో జ్ఞాన భారతి మెట్రో స్టేషన్కు చేరుకున్న సిద్ధార్థ్ ట్రైన్ వస్తుండగా ట్రాక్పైకి దూకేశాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది సకాలంలో ఎమర్జెన్సీ ట్రిప్ సిస్టం(ETS)ను ఉపయోగించి యువకుడి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫుటేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.