Jai Sri Krishna : ఆమె ఫ్లూట్ ఊదుతుంటే గోవులన్నీ పరుగెత్తుకు వస్తున్నాయి.. శ్రీ కృష్ణ మహాత్ముడి పిల్లనగ్రోవికి మైమరచినట్లుగానే...

శ్రీకృష్ణుడి పిల్లనగ్రోవికి బృందావనం మైమరచిపోయింది. ఆ మురళీ గానానికి గొల్లభామలతోపాటు గోవులు కూడా దాసోహం అయిపోయాయి. అందుకే ఆ చోటు నుంచి మధురకు వెళ్లే సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నాయి

Update: 2024-07-27 16:41 GMT

దిశ, ఫీచర్స్: శ్రీకృష్ణుడి పిల్లనగ్రోవికి బృందావనం మైమరచిపోయింది. ఆ మురళీ గానానికి గొల్లభామలతోపాటు గోవులు కూడా దాసోహం అయిపోయాయి. అందుకే ఆ చోటు నుంచి మధురకు వెళ్లే సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నాయి. వద్దని అడ్డుపడ్డాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నామంటే... శ్రీ కృష్ణ పరమాత్మ గాన గంధర్వానికి గోవులు ఎలా వెతుక్కుంటూ వచ్చాయో ఓ మహిళ ఫ్లూట్ ఊదుతుంటే కూడా ఆవులు, లేగ దూడలు ఆమె దగ్గరికి పరుగెత్తుకు వచ్చేశాయి. ప్రేమగా హత్తుకుంటూ.. తన చుట్టే తిరిగాయి.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె సంగీతంలో అంత గొప్ప మహిమ దాగి ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. మహిళ అవతారంలో శ్రీకృష్ణుడు వచ్చాడా అన్నట్లుగా ఉందని అంటున్నారు. ఈ రోజు ఇంటర్నెట్ లో చూసిన బెస్ట్ వీడియో ఇదే అని చెప్తున్నారు. గోవులు తమ కృష్ణుడిని వెతుకుతున్నట్లుగా అనిపిస్తుందని.. గూస్ బంప్స్ వస్తున్నాయని 

Tags:    

Similar News