Viral : పెళ్లి కానుక.. నీతా అంబానీ రూ. 500 కోట్ల నెక్లెస్ రూ. 178కే త్వరపడండి..

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ మ్యారేజ్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ప్రీవెడ్డింగ్

Update: 2024-05-30 16:12 GMT

దిశ, ఫీచర్స్: అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ మ్యారేజ్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన అంబానీ ఫ్యామిలీ.. ఇప్పుడు సెకండ్ ప్రీవెడ్డింగ్ కూడా ప్లాన్ చేసింది. మెహందీ, సంగీత్ ఒక్కో ఈవెంట్ ఒక్కో దేశంలో జరగనుంది. జూలై 14న జరిగే పెళ్లితోనైనా సెలబ్రేషన్స్ ముగుస్తాయో లేదో చెప్పలేం.

ఇక ఇదంతా పక్కన పెడితే ప్రీవెడ్డింగ్ ఫంక్షన్ లో నీతా అంబానీ ధరించిన గ్రీన్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ. 500 కోట్లు అనే విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఇంట్లో తమ భార్యలు ఇలాంటి జ్యూవెలరీ అడిగితే ఎటు పోయేది, ఏం చేసేది అనే డిస్కషన్ జరిగింది. అయితే ఇందుకు చక్కని పరిష్కారం దొరికింది. సేమ్ ఇలాగే ఉండే డూప్లికేట్ నెక్లెస్ మార్కెట్ లోకి వచ్చింది. కేవలం రూ. 178కే అదిరిపోయే ఆభరణం అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. హమ్మయ్య పెళ్లి రోజు కానుక దొరికేసింది.. ఇది ఇచ్చి భార్యను కూల్ చేయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు మగాళ్లు.



Similar News