అతివేగంతో కారు అదుపుతప్పి విద్యార్థికి తీవ్ర గాయాలు

దిశ, కంటోన్మెంట్: అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి ముందున్న నాలుగు వాహనాలను ఢీ కొట్టడంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్‌పల్లి స్వర్గధామానగర్ కాలనీకి చెందిన సిద్ధార్థ్ రెడ్డి (20) అనే విద్యార్థి, ఈ నెల 13న ఈసీఐఎల్ నుండి తన అన్నయ్య విజయ్ తో కలిసి బైక్ మీద స్వర్గధామానగర్ కాలనీకి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గ […]

Update: 2021-08-14 07:21 GMT

దిశ, కంటోన్మెంట్: అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి ముందున్న నాలుగు వాహనాలను ఢీ కొట్టడంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్‌పల్లి స్వర్గధామానగర్ కాలనీకి చెందిన సిద్ధార్థ్ రెడ్డి (20) అనే విద్యార్థి, ఈ నెల 13న ఈసీఐఎల్ నుండి తన అన్నయ్య విజయ్ తో కలిసి బైక్ మీద స్వర్గధామానగర్ కాలనీకి వస్తున్నాడు.

ఈ క్రమంలో మార్గ మధ్యలోని డైయిరీ ఫారం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్దకు చేరుకోగా వెనుక నుండి వేగంగా వచ్చిన ఏపీ 37డీఎల్ 6247 నంబర్ గల క్రేటా కారు బైకును ఢీకొనడంతో సిద్ధార్థ్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అంతలోనే ఆగకుండా ఎదురుగా వస్తున్న కారును, రెండు బైకులను సైతం ఢీ కొట్టడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News