ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. నలుగురు మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని గడ్చిరోలిలో మరోసారి కాల్పుల మోత మోగింది.

Update: 2024-10-21 12:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని గడ్చిరోలిలో మరోసారి కాల్పుల మోత మోగింది. గడ్చిరోలి జిల్లాలోని భ్రమాఘడ్ లో భద్రతా దళాలు కూంబింగ్ చేపడుతుండగా.. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలకు చెందిన ఓ జవాన్ కు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్ ను హెలికాప్టర్ లో నాగపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎన్కౌంటర్ గురించి గడ్చిరోలి ఎస్పీ ఓ ప్రకటన జారీ చేశారు. 


Similar News