పోరాటాలు చేసేవారే పార్టీకి అవసరం- మాజీ సీఎం చంద్రబాబునాయుడు

దిశ, ఏపీ బ్యూరో : ప్రజా పోరాటాలు చేసే నాయకులే పార్టీకి అవసరం అని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న టీడీపీ ఉపాధ్యక్షుడు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెహ్రూ త్వరగా కోలుకోవాలని, ఆ భగవంతుడు పరిపూర్ణ ఆరోగ్యం కల్పించాలని ఆకాక్షించారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెహ్రూ, […]

Update: 2021-08-27 10:59 GMT

దిశ, ఏపీ బ్యూరో : ప్రజా పోరాటాలు చేసే నాయకులే పార్టీకి అవసరం అని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న టీడీపీ ఉపాధ్యక్షుడు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నెహ్రూ త్వరగా కోలుకోవాలని, ఆ భగవంతుడు పరిపూర్ణ ఆరోగ్యం కల్పించాలని ఆకాక్షించారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెహ్రూ, పదవుల కన్నా తన ప్రాంతానికి సాగు, తాగునీరు కల్పించాలని తపన ఎక్కువగా ఉండేదని, చాగల్నాడు ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకెళ్లిన ఘనత ఆయనదే అన్నారు.

మెట్ట ప్రాంతానికి పుష్కర ఎత్తిపోతల పథకం, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, మల్లవరం ఎత్తిపోతల పథకం, ఇలా అనేక పథకాలతో గోదావరి నీళ్లు మెట్ట ప్రాంతాల్లో గలగల పారించారన్నారు. పోలవరం నిర్వాసితుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ అఖిలపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుని ఢిల్లీలో చేసిన ధర్నాలో అనారోగ్యానికి గురికావడం ఆందోళనకరమన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు టీడీపీ ఇన్ చార్జి జ్యోతుల నవీన్, జగ్గంపేట రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ జ్యోతుల మణి, తోట సునీత, జ్యోతుల లక్ష్మి దేవి తదితరులున్నారు.

Tags:    

Similar News