అత్యాధునిక కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి.. సీఎం వైఎస్ జగన్

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సమస్యలు, వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళకుండా అంతర్జాతీయ స్ధాయిలో, అత్యాధునిక కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి బృందాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కోరారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ గుళ్ళపల్లి ఎన్‌ రావు, ఫౌండర్‌ మెంబర్‌ జి.ప్రతిభా రావు మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలో టెరిషియరీ కేర్‌ ఐ […]

Update: 2021-11-02 08:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సమస్యలు, వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళకుండా అంతర్జాతీయ స్ధాయిలో, అత్యాధునిక కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి బృందాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కోరారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ గుళ్ళపల్లి ఎన్‌ రావు, ఫౌండర్‌ మెంబర్‌ జి.ప్రతిభా రావు మర్యాదపూర్వకంగా కలిశారు.

కడపలో టెరిషియరీ కేర్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ ఏర్పాటుకు అవసరమైన స్ధలాన్ని కేటాయిస్తూ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయంపై సీఎంకి ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్ త‌ర‌ఫున వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంప్రహెన్సివ్‌ ఐ కేర్‌కు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్.. సీఎం వైయస్ జగన్‌తో ప్రాధమికంగా చర్చలు జరిపింది.

కంటికి సంబంధించి, అంధత్వ నివారణకు స్క్రీనింగ్‌ నుంచి సర్జరీ వరకూ అన్ని స్ధాయిలలోనూ అత్యాధునిక వైద్యం అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి సీఎం జగన్ సూచించారు. అందుకు ఎల్‌వీ ప్రసాద్ యాజమాన్యం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న అన్ని అనాధ శరణాలయాలలోని చిన్నారులకు నేత్ర వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా చేసేందుకు ముందుకొచ్చింది. ఈ సమావేశంలో ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ రెడ్డి పప్పూరు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News