పరీక్ష రాయడానికి బైక్‌పై బయలు దేరిన ఇద్దరు స్నేహితులు.. అంతలోనే

దిశ, కీసర : రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరొక విద్యార్థికి గాయాలు అయిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌కు చెందిన పగడల బాలచందర్ (22), సృజన్ లు ఇద్దరు ద్విచక్ర వాహనం పై గురువారం షాపూర్ నుండి కీసర ఔటర్ రింగ్ రోడ్డులో గల సర్వీస్ రోడ్డు గుండా హయత్ నగర్ లోని ఐ-సెట్ పరీక్ష రాయడానికి వెళ్తున్నారు. కీసర […]

Update: 2021-08-19 07:29 GMT

దిశ, కీసర : రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరొక విద్యార్థికి గాయాలు అయిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌కు చెందిన పగడల బాలచందర్ (22), సృజన్ లు ఇద్దరు ద్విచక్ర వాహనం పై గురువారం షాపూర్ నుండి కీసర ఔటర్ రింగ్ రోడ్డులో గల సర్వీస్ రోడ్డు గుండా హయత్ నగర్ లోని ఐ-సెట్ పరీక్ష రాయడానికి వెళ్తున్నారు.

కీసర ఓఆర్ఆర్ ఏక్సిట్-8 వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. దీంతో బాలచందర్, సృజన్ లు ఇద్దరు ద్విచక్ర వాహనంతో పాటు చెట్ల పొదలోకి దూసుకెళ్లడంతో బాలచందర్ అక్కడికక్కడే మృతి చెందగా, సృజన్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు.

Tags:    

Similar News