ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేశావ్ అంటున్న నెటిజన్లు(ఫొటోలు)

మలయాళీ బ్యూటీ అంజు కురియన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-27 09:24 GMT

దిశ, సినిమా: మలయాళీ బ్యూటీ అంజు కురియన్(Anju Kurien) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. మోడలింగ్ రంగంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామకు.. ‘ఓం శాంతి ఓషానా’(Om Shanti Oshana) అనే సినిమాలో వినీత్ శ్రీనివాస్‌(Vineeth Srinivas)తో కలిసి నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ‘ఇదం జగత్’(idam Jagath) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలోని తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఓ రేంజ్ ఫాలోయింగ్ పెంచుకుంది. తరచుగా లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. తన నిశ్చితార్థానికి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది అంజు కురియన్. "నేను నిన్ను కనుగొన్నాను. ఈ క్షణానికి మనల్ని నడిపించిన ఎన్నో లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ రాసుకొచ్చింది. అలాగే నవ్వు, ప్రేమతో నిండిన ఈ ప్రయాణం ఒక అద్భుతం అంటూ తన ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది. దీంతో అంజుకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News