పెళ్లి కాకుండానే నాగార్జున, అమలకు బిగ్ షాకిచ్చిన శోభిత..?

గత కొద్ది రోజుల నుంచి అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆగస్ట్‌లో వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-22 12:35 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆగస్ట్‌లో వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అదే నెల 8వ తేదీన నిశ్చితార్థం చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేశారు. అయితే ఈ విషయాన్ని నాగార్జున(Nagarjuna) ‘X’ వేదికగా వెల్లడించి పలు ఫొటోలు షేర్ చేశారు. దీంతో పెళ్లికి సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శోభిత పసుపు దంచుతున్న ఫొటోలు షేర్ చేయడంతో అక్టోబర్ చివరి వారంలో వీరి పెళ్లి జరగనున్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, శోభితకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ అమ్మడు నాగచైతన్య(Naga Chaitanya)తో పెళ్లి జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఉండకుండా ముంబైలో కాపురం పెట్టనున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే.. బాలీవుడ్‌లో ఆఫర్స్ ఎక్కువగా వస్తూ ఉండటంతో పాటు.. అక్కడే తన సొంత ఇల్లు కూడా ఉంది కాబట్టి ముంబైలో ఉండటం బెటర్ అని డిసైడ్ అయినట్లు టాక్.

ఈ విషయాన్ని నాగచైతన్య(Naga Chaitanya)తో కూడా చర్చించినట్లు ఆయన ఒప్పుకున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ వార్తలు చూసిన వారు నాగార్జున, అమలకు బిగ్ షాకిచ్చిందిగా అని అంటున్నారు. అలాగే ముంబైకి వెళ్తే ఇగ చైతు అక్కినేని కుటుంబాన్ని వదిలేసినట్టే? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఇవన్నీ ప్రచారాలు అని కొట్టిపారేస్తున్నారు.

Tags:    

Similar News