సంస్కృతి గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదే.. రేణుదేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-20 04:04 GMT

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ న్యూ మూవీ చేస్తున్నట్టు రీసెంట్‌గా పోస్ట్ ద్వారా వెల్లడించింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో.. తాజాగా, రేణు దేశాయ్.. తన నివాసంలో గణపతి చండీ హోమం నిర్వహించింది. శరద్ పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో ఆమె తనయుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. హోమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ భామ.. మన సంస్కృతి గొప్పతనాన్ని మన పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదేనంటూ సూచించింది. 'శరద్ పూర్ణిమ సందర్భంగా మా ఇంట్లో గణపతి, చండీహోమం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించాం. మన సాంప్రదాయలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాలి. పూజ సమయంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా, ప్రశాంతంగా భక్తి మీదనే దృష్టి పెట్టాలి' అని ఈ పోస్టులో రాసుకొచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

(video link credits to renu desai instagram id) 


Similar News