పేకాట రాయుళ్ల అరెస్ట్..

పెదకూరపాడు మండలం లోని లింగంగుంట్ల గ్రామం వ్యవసాయ భూమి సమీపంలో పేకాట ఆడుతున్న 5మందిని పెదకూరపాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Update: 2024-10-22 14:58 GMT

దిశ, పెదకూరపాడు:పెదకూరపాడు మండలం లోని లింగంగుంట్ల గ్రామం వ్యవసాయ భూమి సమీపంలో పేకాట ఆడుతున్న 5మందిని పెదకూరపాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో స్థానిక ఎస్సై గిరిబాబు సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. దాడిలో పేకాట ఆడుతున్న 5మందిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.1150 నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 5గురు తప్పించుకొని పోయారని , వారిని కూడా పట్టుకుంటామని అన్నారు. ఈ మేరకు నిందితులైన కుంభ వెంకటేశ్వర్లు, కట్టె పోగు బ్రహ్మేశ్వర రావు, పాటిబండ్ల సుబ్బారావు, అమర్లపూడి కుమార్, మొండి కోత ప్రసాద్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గిరిబాబు హెచ్చరించారు.


Similar News