రాత్రి కుమారుడు...తెల్లారేసరికి తల్లి....

రాత్రి కుమారుడు...తెల్లారేసరికి తల్లి....మరణించిన ఉదంతం ఇది.

Update: 2024-10-22 15:07 GMT

దిశ, ఇల్లందు : రాత్రి కుమారుడు...తెల్లారేసరికి తల్లి....మరణించిన ఉదంతం ఇది. స్థానిక జగదాంబ సెంటర్ సీతారామ టాకీస్ వెనకాల గల పీర్ల ఆసర్ ఖానా మాలిక్ ప్రాంతంలో సోమవారం ఉదయం పసుపులేటి నరేందర్(60) మృతి చెందాడు. కుమారుని మరణ వార్త విన్న ఆయన తల్లి సులోచనను (82) రెండవ కుమారుడైన పసుపులేటి కృష్ణ వైజాగ్ నుంచి అదే రోజు రాత్రి ఇల్లందుకు తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లి మనోవేధన గురైంది. మంగళవారం ఉదయం కొడుకు మృతదేహాన్ని వైకుంఠ ధామానికి తీసుకెళ్తుండగా ఆమె గుండెపోటుతో మృతి చెందింది.  

Tags:    

Similar News