Balakrishna : "జరిగేది అఖండ తాండవం" అంటూ సినిమాలోని డైలాగ్ చెప్పిన బాలయ్య

సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమంలో బాలయ్య బాబు సూపర్ డైలాగ్ చెప్పారు

Update: 2024-10-16 08:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అది పక్కా హిట్ అవ్వాల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ మూడు సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీ లో హ్యాట్రిక్ హిట్ కొట్టి రికార్డు క్రియోట్ చేసారు.

అయితే, అఖండ మూవీ తర్వాత అఖండ 2 ఉంటుందని ప్రకటించారు. దసరా రోజు చెప్పినట్టే అఖండ 2 మూవీని ఈ రోజు అనౌన్స్ చేసారు. బాలయ్య – బోయపాటి కాంబోలో నాలుగో మూవీగా అఖండ 2 మూవీ రాబోతుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ రోజు బాలకృష్ణ అఖండ 2 సినిమా ఓపెనింగ్ జరిగింది. తాజాగా, టైటిల్ ను ప్రకటిస్తూ మూవీకి సంబంధించిన పోస్టర్, టైటిల్ థీమ్ కూడా రిలీజ్ చేస్తూ ఓ వీడియోని షేర్ చేసారు.

సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమంలో బాలయ్య బాబు సూపర్ డైలాగ్ చెప్పారు. " ఈ నేల అసురుడిది కాదు.. ఈశ్వరుడిది.. పరమేశ్వరుడిది.. కాదని తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం " అంటూ డైలాగ్ చెప్పి సినిమా పై అంచనాలు పెంచేశారు.

Tags:    

Similar News