కొత్త మార్కెట్ కమిటీ పాలకవర్గాల ప్రమాణస్వీకారం

నిడమనూరు బాలాజీ ఫంక్షన్ హాల్ లో కొత్త మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు.

Update: 2024-10-16 12:20 GMT

దిశ, నిడమనూరు : నిడమనూరు బాలాజీ ఫంక్షన్ హాల్ లో కొత్త మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు,నల్లగొండ ఎంపీ రఘు వీర్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,మాజీ సి యల్ పి నేత కుందూరు జానారెడ్డిలు పాల్గొన్నారు. మంత్రుల సమక్షంలో నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. చైర్మన్ గా అంకతి సత్యం,వైస్ చైర్మన్ గా బుసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తో పాటు..డైరెక్టర్లు గా మన్నెం శంకర్,పాల్వయి చంద్రశేఖర్ రెడ్డి, మెండె వెంకటేశ్వర్లు,వంగాల అనిల్ కుమార్ రెడ్డి,సపావట్ శ్రీను, యం డి, యాకుబ్ అలీ, పొలగోని పరుశురాం,అనుముల మంజుల, కార్పాటి సైదులు,గంగుల గురువయ్య, రేపాల మధుసూదన్,బలిదె అశోక్,చైర్మన్, పి ఏ సి ఎస్, త్రిపురారం,జిల్లా మార్కెటింగ్ అధికారి,హాలియా వ్యవసాయ శాఖ ఏ డి,నిడమనూరు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్ నారాయణ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్, మార్కెట్ కార్యదర్శి చందర్ రావు,మరియు కాంగ్రెస్ నాయకులు డి సీ సీ అధ్యక్షులు శంకర్ నాయక్,యడవెల్లి రంగశాయిరెడ్డి,ముంగి శివ మారయ్య,కొండేటి మల్లయ్య, కొండా శ్రీనివాసరెడ్డి, ఉన్నం చిన్నవీరయ్య,నందికొండ రామేశ్వరి మట్టారెడ్డి, యడవెల్లి వల్లభరెడ్డి నూకల వెంకటరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.


Similar News