ఈ నెల 17న ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం

ఏక్సిళ్ళ ఎడ్యుకేషన్ గ్రూప్ నిర్వహిస్తున్న ఏక్సిళ్ళ ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం ఈ నెల 17న హైదరాబాద్ లోని టీ-హబ్ లో జరగనుంది.

Update: 2024-08-10 16:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏక్సిళ్ళ ఎడ్యుకేషన్ గ్రూప్ నిర్వహిస్తున్న ఏక్సిళ్ళ ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం ఈ నెల 17న హైదరాబాద్ లోని టీ-హబ్ లో జరగనుంది. దక్షిణాదిలోని అత్యంత ప్రభావవంతమైన, నిష్ణానితులైన మహిళలకు, వారి రంగాలలో రాణిస్తూ.. సామాజిక పురోభివృద్దికి సహకరిస్తున్న మహిళలకు ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, తెలంగాణ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏక్సిళ్ళ ఎడ్యుకేషన్ గ్రూప్ స్థాపకుడు అరవింద్ అరసవిల్లి మాట్లాడుతూ.. సామాజిక పురోగతి సాధిస్తున్న మహిళల విజయాలను గుర్తించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పరిశ్రమలు, వృత్తి నిపుణులు, న్యాయనిపుణులు వంటి విభిన్న రంగాలకు చెందిన మహిళలు ఒకచోట చేరి తమ ఆలోచనలు ఈ వేదిక ద్వారా పంచుకోబోతున్నారని తెలియ జేశారు.  


Similar News