వారిని వదిలేది లేదు.. ఎంతవరకైనా వెళ్తా.. Madavaneni Raghunandan Rao

మహిళా మంత్రి కొండా సురేఖ మీద అనుచిత పోస్టులు చేసిన వారిని వదిలేదు అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(RaghunandanRao).

Update: 2024-10-02 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహిళా మంత్రి కొండా సురేఖ మీద అనుచిత పోస్టులు చేసిన వారిని వదిలేదు అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(RaghunandanRao). వాళ్ళు ఎంతటివారైనా సరే.. ఎంతవరకైనా వెళ్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆడబిడ్డను ఇలా అవమానించడం తగదని, వారి ఇళ్ళలో మహిళలను ఇలాగే అగౌరవపరుస్తార అని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సైబరాబాద్ లో, దుబ్బాక, సిద్దిపేట పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేశానని పేర్కొన్నారు. నేడు గాంధీ జయంతి(Gandhi Jayanthi) సందర్భంగా సంగారెడ్డిలో బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వఛ్ఛభారత్(Swachcha Bharath) లో బాగంగా రోడ్లు ఊడ్చారు. హైడ్రాపై ఆ పార్టీ నేతలే తలా ఒకరకంగా మాట్లాడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాపై అటు ప్రజలకు, ఇటు ఆ పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దారుణాలు మర్చిపోయి ఇపుడు నోరు తెరవడం విడ్డూరంగా ఉందని రఘునందన్ రావు అన్నారు.


Similar News