Shridhar Babu: ‘మేమేమి ఎంటర్టైన్మెంట్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదు’ మంత్రి శ్రీధర్ స్ట్రాంగ్ కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ విషయంలో జరుగుతున్న అబద్ధపు ప్రచారంపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-08-17 12:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణను వీడి ఇతర రాష్ట్రానికి తరలి వెళ్తున్న్నదని దుష్ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికి పోవడం లేదని స్పష్టత ఇచ్చారు. కొన్ని కంపెనీలు వారి విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరిస్తాయన్నారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన మంచిని కంటిన్యూ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిశ్రమలలో 30 శాతానికి మించి గ్రౌండ్ కాలేదని కానీ మా హయాంలోని విదేశీ పర్యటనల సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలను గ్రౌండ్ చేయడానికి స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దావోస్ పర్యటనలో చేసుకున్న 40 వేల కోట్ల పెట్టుబడులపై ఆయా సంస్థలతో అధికారులు టచ్ లో ఉన్నారని చెప్పారు. ఎంఓయూ జరగ్గానే వెంటనే గ్రౌండ్ అవ్వదని కేసీఆర్ గతంలో రెండు ఫ్లైట్లలో చైనా వెళ్లారు. ఆసమయంలో రూ.వెయ్యి కోట్ల ఎంవోయూ జరిగితే గ్రౌండ్ అయింది వందో రెండు వందలో మాత్రమేనన్నారు. కొత్త టెక్నాలజీతో రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ నాయకుల బంధువులు వచ్చినా ఆహ్వానిస్తామని త్వరలోనే కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకుబోతున్నామని తెలిపారు.

ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్లలే:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియా దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి అని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలకు నమ్మకాన్ని కల్పించేలా సీఎం పర్యటన కొనసాగిందన్నారు. మేము ఎంటర్టైన్మెంట్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదని, రాబోయే 20 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఏమిటో తెలియజేసేందుకు ఒక ప్రయత్నం చేశామన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై పలువురితో చర్చించామన్నారు. ఈ ఫారిన్ టూర్ లో మొత్తం 19 సంస్థలతో రూ.31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఈ ఎంవోయూల ద్వారా 30 వేల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందన్నారు. దక్షిణ కొరియాలో దాదాపు 12 సంస్థలతో చర్చలు జరిపామన్నారు. రాబోయే 20 ఏళ్లపాటు కాంగ్రెస్ లక్ష్యం, గమ్యం ఏమిటో పలు సంస్థలకు వివరించామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అని అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. పెట్టుబుడలకు రాష్ట్రంలో మంచి అనుకూల వాతావరణం ఉందని వివరించామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

విస్తరించేందుకు ఆసక్తి..

కార్నింగ్ సంస్థ కంపెనీ విస్తరణపై కొత్తగా ఒప్పందం చేసుకుందని, కాగ్నిజెంట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో బయోడిజైర్ సిటీని ఏర్పాటు చేయాలని స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీని కోరామన్నారు. రాష్ట్రంలో మెగా ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని హ్యూందాయ్ కంపెనీ ముందుకు వచ్చిందని, హైదరాబాద్ లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని యంగ్ వన్ కంపెనీ ముందుకు వచ్చిందని వెల్లడించారు. మూసీ పునరుజ్జీవనం కోసం కొన్ని అధ్యయనాలు చేశామని, మూసీ సుందరీకరణపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో చర్చించామన్నారు. ప్రగతికి సంబంధించిన అంశంలో మాకు ఎలాంటి రాజకీయ బేషజాలు లేవని చెప్పామన్నారు. చైనా ప్లస్ 1 అనే ఫిలాసఫి మేము ముందుకు వెళ్తున్నాం. తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో భాగంగా సీఎం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారన్నారు.

Tags:    

Similar News