తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా : పాలకుర్తి ఎమ్మెల్యే

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రశాంతంగా

Update: 2024-07-04 11:20 GMT

దిశ,తొర్రూర్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రశాంతంగా సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి చైర్మన్ రామచంద్రయ్య అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా ఎక్స్ అఫీషియో మెంబర్ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీకి సంబంధించిన నివేదికను సమావేశంలో కమిషనర్ శాంతి కుమార్ ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వార్డుల వారీగా అభివృద్ధి పనులపై కూడా పాలకమండలితో చర్చించారు. ఇప్పటికే వార్డులలో 62 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని మున్సిపాలిటీ నిధులను ప్రజలకు అవసరమయ్యే రీతిలో ఖర్చు అయ్యే విధంగా ప్రతి ఒక్క కౌన్సిలర్ కృషి చేయాలన్నారు.

సిబ్బంది కూడా తక్కువగా ఉండటం వల్ల శానిటేషన్ సిబ్బందిని పెంచుటకు గవర్నమెంట్ కు సిఫార్సు చేస్తానన్నారు. రానున్న రోజుల్లో తొర్రూర్ ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రోజు రోజుకు తొర్రూరు పట్టణ అభివృద్ధి చెందుతున్నందున మాస్టర్ ప్లాన్ రెడీ చేయుటకు టౌన్ ప్లానింగ్ అధికారిని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో అధికారులక కొరత ఉన్నందున గవర్నమెంట్ కు సిఫారసు చెసి రెగ్యులర్ అధికారులను నియమించుటకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ వార్డుల వారీగా 5 లక్షల రూపాయలు మంచినీటి కోసం రెండు లక్షలు ప్రతి వార్డు ఏడు లక్షల రూపాయలు కేటాయించామని ఈ ఏడు లక్షల రూపాయలని వార్డు అభివృద్ధికి అవసరం ఉన్న మేర కేటాయించాలని అన్నారు.

అలాగే అమరవీరుల స్థూపం మహనీయుల విగ్రహాలకు సుందరీకరణ విషయంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, మున్సిపల్ ఏఈ రంజిత్, మేనేజర్ కట్టా స్వామి, కౌన్సిలర్లు భూసాని రాము, తునం రోజా, తూర్పాటి సంగీత రవి, పేర్ల యమునా జంపా, దారావత్ సునీత జైసింగ్,నరుకుటి గజానంద్ ,చగిలేలా అలివేలు, దొంగరి రేవతి శంకర్, కర్నె నాగజ్యోతి నాగరాజు, గుగులోత్ శంకర్, కొలుపుల శంకర్, కో ఆప్షన్ సభ్యులు, మహమ్మద్ జలీల్, కుర్ర కవిత శ్రీనివాస్, అకౌంటెంట్ శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News