‘జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సీఎంతో ప్రకటన చేయిస్తాం’

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల

Update: 2024-06-28 14:24 GMT

దిశ, హన్మకొండ : సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులను సిక్స్ మెన్ కమిటీ కలిశారు. రెండు జర్నలిస్ట్ సొసైటీల స్థలాలు క్లియర్ చేయటంతో పాటు, ఏ సొసైటీలో లేని వర్కింగ్ జర్నలిస్టుల కోసం అనువైన స్థలం కేటాయించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయిస్తామని మాట ఇచ్చారు.

భూకేటాయింపులకు సంబంధించి సీఎం తో అధికారులకు ఆదేశాలు జారీ చేయిస్తామని అన్నారు. ఎన్నో ఏళ్ళనుండి ఎదురుచూస్తున్న జర్నలిస్టుల సొంత ఇంటి స్థలం విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరామని ఆ సిక్స్ మెన్ కమిటీ తెలిపారు. ఎమ్మెల్యేలను కలిసిన సిక్స్ మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్, కో-కన్వీనర్లు వేముల నాగరాజు, బొక్క దయ సాగర్,సభ్యులు, గడ్డం రాజిరెడ్డి,మస్కా పురి సుధాకర్,బొల్లారం సదయ్య ఉన్నారు.

Similar News