నక్సలైట్లమంటూ ఇంట్లోకి చొరబడి నగదు చోరీ

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయి అలజడి సృష్టించారు

Update: 2024-09-28 10:27 GMT

దిశ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయి అలజడి సృష్టించారు. బైక్ నుంచి జారి పడ్డామని, కొన్ని మంచినీళ్లు ఇవ్వండి అంటూ అర్ధరాత్రి సూదగాని వెంకటయ్య అనే వృద్దున్ని నమ్మించి ఇంట్లోకి చొరబడ్డారు. నక్సలైట్లమని బాధితున్ని బెదిరించి ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ రూ. 35 వేల ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వెంకటయ్య తెలిపాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఝాన్సీ తెలిపారు. అలాగే అపరిచిత వ్యక్తులు అనుమానస్పదంగా కనపడితే మాకు తెలియపరచాలని, లేదంటే 100కి డయల్ చేయాలని సూచించారు. కాగా ఇది జల్సాలకు అలవాటు పడిన వారి పని అంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Similar News