తల్లి మరణం తట్టుకోలేక యువతి మృతి

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన విషాద ఘటన మల్హర్ మండలం ఎడ్లపల్లిలో మంగళవారం జరిగింది.

Update: 2024-10-22 15:24 GMT

దిశ, మల్హర్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన విషాద ఘటన మల్హర్ మండలం ఎడ్లపల్లిలో మంగళవారం జరిగింది. కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన మంథని సౌమ్య(19) అనే యువతి తల్లి 8 నెలల క్రితం మృతి చెందింది. తల్లి లేని లోటు జీర్ణించుకోలేక మనోవేదనకు గురైన సౌమ్య ఆదివారం పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా గమనించిన తండ్రి దుర్గయ్య వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయించినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఉండగానే మంగళవారం మృతి చెందినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


Similar News