పత్తి వ్యాపారి పరార్.. రూ. 3 కోట్లు కుచ్చు టోపీ

ఓ వ్యాపారి రైతుల నుంచి పత్తి పంట తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పరారీ అయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2023-06-13 16:19 GMT

దిశ, రేగొండ (చిట్యాల): ఓ వ్యాపారి రైతుల నుంచి పత్తి పంట తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పరారీ అయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పత్తి వ్యాపారి సుమారు 3 కోట్ల రూపాయలతో ఉడాయించాడు. వివరాల్లో్కి వెళితే.. చిట్యాల మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన వ్యాపారి సురాబు శంకర్ రావు చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాల్లోని గ్రామాలలో అధిక ధర పేరుతో రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తూ కొంత కాలం రైతులను నమ్మించాడు.


కానీ నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో సహా శంకర్ రావు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతని ఫోన్ కూడా పని చేయకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో సామాను సైతం ఖాలి అవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శంకర్ రావును వెంటనే అరెస్ట్ చేసి మా డబ్బులు మాకు ఇప్పించాలని వారు కోరుతున్నారు.


Similar News