నిత్యం ప్రజా సేవలో ఉండాలి : మంత్రి పొన్నం

మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండల పరిషత్ ప్రాదేశిక

Update: 2024-07-04 10:16 GMT

దిశ, ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మేకల స్వప్న అధ్యక్షత వహించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శక్తికి మించిన సేవ చేశారని వారి సేవలను కొనియాడారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదని పేర్కొన్నారు. సోనియా గాంధీ చట్టసభలలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం తో ఈరోజు ప్రతి సభలో మహిళల ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివరించారు. పదవీ కాలం ముగిసినా గ్రామాల్లోని సమస్యలను సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తానని మంత్రి చెప్పారు.

రిజర్వేషన్లు అడ్డంకులను అధిగమించి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తామని మంత్రి వివరించారు. ఎంపీపీ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కలిసికట్టుగా అందరం మండల అభివృద్ధిలో పాల్పంచుకున్నామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో జగత్ సింగ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేష్, ఎంపీడీవో విజయ్ కుమార్ ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీపతి రవీందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


Similar News