BREAKING : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఈ.ఈ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు.

Update: 2024-10-24 13:50 GMT

దిశ, జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. పంచాయతీ రాజ్ ఈ.ఈ దిలీప్ లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు. రోడ్డు పనుల బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో అధికారులు రైడ్స్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి...ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News