KU PhDAdmissions : కేయూలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్..

కాకతీయ విశ్వవిద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి

Update: 2024-09-19 11:10 GMT

దిశ, హనుమకొండ టౌన్ : కాకతీయ విశ్వవిద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను పీహెచ్‌డీ లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. వైస్ ఛాన్సలర్ (ఇంచార్జ్) వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విభాగాల వారీగా ఖాళీల మేరకు ప్రతి సం. రెండు పర్యాయాలు ఖాళీలకు అనుగుణంగా జనవరి,జూలై నెలల్లో దరఖాస్తులు కోరనున్నట్టు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఫెలోషిప్ హోల్డర్స్ (యూజీసీ/నెట్/గేట్/జీప్యాట్ ఇతర జాతీయ స్థాయి పరీక్షల స్కోర్ ఆధారంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ అ ఉత్తర్వులు లో కోరారు. మరిన్ని వివరాల కొరకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.in లో చూడవచ్చన్నారు.


Similar News