అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. లారీకింద పడి వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోర్ వేల్ లారీ కింద పడడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2024-10-14 06:47 GMT

దిశ తొర్రూరు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోర్ వేల్ లారీ కింద పడడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా, తోరూర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా సూరారంకు చెందిన కూన వరుణ్(20)అనే యువకుడు.. తన స్నేహితుడు సూర్యతో కలిసి హైదారాబాద్ నుండి ఖమ్మంకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై తొర్రూరు పట్టణం ప్రభుత్వ పాఠశాల సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి కింద ఇద్దరు స్నేహితులు పడిపోయారు. అదే టైంలో అటుగా వచ్చిన బోర్ వెల్ లారీ మీదికెక్కడం వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వరుణ్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. వరుణ్ స్నేహితుడు సూర్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Similar News