Collector : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి....

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

Update: 2024-10-21 09:28 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ, దివ్యాంగుల సంక్షేమ శాఖ, తదితర విభాగాలకు చెందిన (114 )దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తులను సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించుటకు తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రాజు, ఏడి ఎస్ఎల్ఆర్ ఏ. నరసింహమూర్తి, డిసిఓ వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహ స్వామి, డిప్యూటీ జడ్పీ సీఈవో నర్మద, డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి, డిఇఓ విజయనిర్మల, డీడీ గ్రౌండ్ వాటర్ సురేష్, ఈఈ ఆర్ అండ్ బి భీమ్లనాయక్, డిఇఓ రాజేశ్వర్, డివిఎచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, ఏడి హార్టికల్చర్ జి.మరియన్న, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News