నెల్లికుదురు మండలంలో తహశీల్దార్ పై దాడికి యత్నం..

ఏం పీక్కుంటావో పీక్కో నా ట్రాక్టర్ ఆపడానికి నువ్వు ఎవరివి నువ్వు నన్ను ఏం చేయలేవు అంటూ తహశీల్దార్ కొనిచింతల రాజు పైకి దాడికి యత్నం చేశాడు ఇసుక అక్రమాసురుడు.

Update: 2024-10-24 01:44 GMT

దిశ, నెల్లికుదురు : ఏం పీక్కుంటావో పీక్కో నా ట్రాక్టర్ ఆపడానికి నువ్వు ఎవరివి నువ్వు నన్ను ఏం చేయలేవు అంటూ తహశీల్దార్ కొనిచింతల రాజు పైకి దాడికి యత్నం చేశాడు ఇసుక అక్రమాసురుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి శివారు ఆకేరు వాగులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. తహశీల్దార్ రాజు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ కొత్త పెళ్లికి చెందిన జెల్ల యాకయ్య బుధవారం సాయంత్రం ట్రాక్టర్లో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నాడు ఆర్ ఐ తో పాటు రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి ఇసుక ట్రాక్టర్లను ఆపే ప్రయత్నం చేశారు.

దీంతో సంబంధిత యాకయ్య ఆర్ఐని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడంతో ఆర్ఐ తమకు సమాచారం అందించారు. తాను అక్కడికి వెళ్లి ఎందుకు అక్రమంగా ఇసుక ట్రాక్టర్ నడుపుతున్నావని అనగా తనను సైతం దుర్భాషలాడుతూ దాడికి యత్నం చేశాడని తెలిపారు. దీంతో తహశీల్దార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై చిర్ర రమేష్ బాబు సంబంధిత ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకొని జిల్లా యాకయ్య పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Similar News