800 పోస్టులు అప్ గ్రేడ్ చేయండి! విద్యాశాఖ సెక్రటరీకి పండిత పరిషత్ నేతల వినతి

రాష్ట్రంలోని 10వేల మంది భాషాపండిత, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేశారని, పదోన్నతులు కల్పించగా మిగిలిపోయిన సుమారు 800 మంది భాషాపండిత, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేసి, వాటిలో అర్హులైన భాషాపండితులకు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2024-08-30 17:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 10వేల మంది భాషాపండిత, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేశారని, పదోన్నతులు కల్పించగా మిగిలిపోయిన సుమారు 800 మంది భాషాపండిత, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేసి, వాటిలో అర్హులైన భాషాపండితులకు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ శుక్రవారం విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి వినతీపత్రం అందజేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిందిగా కోరారు. అలాగే విద్యాశాఖ సెక్రటరీకి ఆర్‌యూపీపీటీఎస్ సంఘం తరుపున ముద్రించిన ‘భాషాపండితుల విజయం’ అనే పుస్తకాన్ని అందజేశారు. బుర్రా వెంకటేశంను కలిసిన వారిలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి రమేశ్ ఉన్నారు.


Similar News