గాంధారి మండల కేంద్రంలో ఇద్దరు పిల్లలు మృతి

అభం శుభం తెలియని పసి పిల్లలుఇద్దరూ కాలు జారి చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.

Update: 2024-02-24 12:04 GMT

దిశ, గాంధారి: అభం శుభం తెలియని పసి పిల్లలుఇద్దరూ కాలు జారి చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ముదెళ్ళి గ్రామంలో ప్రైమరీ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న రవి ( 8) కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువులోకి వెళ్ళగా అక్కడ కాలుజారి రవి చెరువులో పడిపోయాడు. రవితో పాటు వచ్చిన శశాంక్ (9) వయసు గల రవిని కాపాడే ప్రయత్నంలో శశాంక్ కూడా చెర్లో పడి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News