"వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి.. తీర్థయాత్రలకు పోయింది " : సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

రేవంత్ రెడ్డి తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు.

Update: 2024-10-09 16:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : రేవంత్ రెడ్డి తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్మును ప్రజల బాగు కోసం కాకుండా తెలంగాణ కేసీఆర్ ను తిట్టడానికి వినియోగిస్తున్నాడని, సమాజాన్ని తీర్చి దిద్దాల్సిన టీచర్ల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రావడం ఇష్టంలేని ద్రోహి రేవంత్ కు కేసీఆర్ త్యాగాలు ఎలా కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. రేవంత్ చేతికి పొరపాటున 2014 లో అధికారం ఇస్తే తెలంగాణ వాడిని అమ్మేసే వాడిని, కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంది కనుకే ఈనాడు సీఎం అయ్యాడని రేవంత్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. నువ్వు ఇచ్చిన 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే అని హరీష్ రావు పేర్కొన్నారు. నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఈ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినట్లా? నోటిఫికేషన్లు లేకుండా, పరీక్షలు నిర్వహించకుండా, ఏకంగా నియామకపత్రాలు ఇవ్వడం కుదురుతుందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు కట్టు బానిసవు రేవంత్ అని, తెలంగాణ ప్రజలకు బానిసలం మేమని తెలిపారు. 


Similar News