ఇంటర్‌ పరిక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ముగ్గురు

ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్​ పరీక్షకు ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడినట్లు బోర్డు అధికారులు శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.

Update: 2024-03-02 16:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్​ పరీక్షకు ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడినట్లు బోర్డు అధికారులు శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అందులో జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక విద్యార్థి పట్టుబడినట్లు పేర్కొన్నారు. కాగా సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 4,49,868 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,35,387 మంది హాజరయ్యారు. 14,481 మంది గైర్హాజరయ్యారు.


Similar News