తీవ్ర విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కొత్తూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.

Update: 2024-10-04 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కొత్తూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలువులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరదాగా చెరువులో ఆడుకోవడానికి వెళ్లిన స్వామి, హుస్సేన్, కనకయ్య అనే ముగ్గురు చిన్నారులు నీట మునిగి గల్లంతు అయ్యారు. స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News