తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నిరుద్యోగులు

తెలంగాణ హైకోర్టును గురువారం నిరుద్యోగులు ఆశ్రయించారు.

Update: 2024-07-18 03:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టును గురువారం నిరుద్యోగులు ఆశ్రయించారు. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు తెలిపారు. కాగా, నిరుద్యోగులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ కార్తీక్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. మరో వైపు ఈ రోజు నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్‌ అశోక్ నగర్‌లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.  


Similar News