Minister Sitakka : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రాంతాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Update: 2024-10-25 13:52 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ప్రాంతాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం వెంకటాపూర్ మండలంలోని జవహర్ నగర్ వద్ద రామాలయం చుట్టూ రూ. 5 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో నిర్మించిన కాంపౌండ్ గోడను జిల్లా కలెక్టర్ దివాకర, గ్రంథాలయ చైర్మన్ రవి చందర్ లతో కలిసి మంత్రి సీతక్క సందర్శించారు. అనంతరం గోవిందరావుపేట మండలం, చల్వాయి ఆదర్శ పాఠశాల లో సీఎస్ఆర్ నిధులు మౌరిటెక్ ఐటీ సంస్థ సౌజన్యం 10 కంప్యూటర్ల తో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. అనంతరం చాల్వాయి లోని ట్రైనింగ్ సెంటర్లో మహిళలకు ఉష ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో కుట్టు మిషన్ 25 రోజుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రంను మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎన్నో రోజులుగా టీచర్ల సమస్యలు పెండింగ్లో ఉంటే సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమోషన్ ఇచ్చి, ట్రాన్స్ఫర్స్ చేయడం జరిగిందని అన్నారు. 60 రోజులలో నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా 11,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈనాటి ప్రభుత్వానిదే అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆలోచనతో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆధునిక మైనటువంటి విద్య, కంప్యూటర్ విద్య అందాలానే ఉద్దేశంతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను ములుగు జిల్లాకు పిలువడం జరుగుతుందని అన్నారు. ములుగు అంటే వెనుకబడ్డ జిల్లా అని మనం చెప్పుకుంటున్నాము. కచ్చితంగా జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకురావాలని అన్నారు.మానసిక ఉత్సాహం, ఉల్లాసం ధైర్యం, గౌరవించే మనస్తత్వం కూడా నేర్చుకోవాలని అన్నారు. పేదల పట్ల ప్రేమ కరుణ ఉండాలని అన్నారు.

ప్రతి గ్రూపుకు రెండు లక్షల నుంచి 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థను పట్టింపు లేక విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని, మా ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. ప్రైవేట్ రంగానికి దీటుగా పాఠశాలలను తీర్చుదిద్దుతున్నామని అన్నారు. ఉపాధ్యాయులు ఓపికగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధించాలని సూచించారు. జిల్లాలో అర్హులైన పేద‌వారంద‌రికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం పేద‌వాడి గురించి క‌నీస ఆలోచ‌న చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల ఎదురైనా అభివృద్ది సంక్షేమాన్ని అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా ఏదీ ఆగ‌ద‌ని పేద‌వాడి క‌న్నీరు తుడ‌వ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డి ఈ, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు, పాల్గొన్నారు.


Similar News