కార్యకర్తలకు బీఆర్ఎస్ భరోసా.. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి

కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-25 16:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఇన్స్యూరెన్స్ విభాగం ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వం చేసి ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున చెల్లింపునకు సంబంధించిన మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల్లో మృతి చెందిన వారు సభ్యత్వం సమయంలో నామిని పెట్టిన వారికి బీఆర్ఎస్ పార్టీ రూ.2 లక్షల మంజూరు పత్రాలు అందజేశామని తెలిపారు. 44 మందికి అందజేశామని వెల్లడించారు. ఏ పార్టీ చేపట్టని విధంగా ఇన్స్యూరెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భారత్ కుమార్, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News