చేపల లారీ బోల్తా..ఎగబడిన జనం

చేపల లోడ్ తో వెలుతున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడగా..అందులోని చేపల కోసం స్ధానిక జనం ఎగబడిన తీరు చెరువు లూటీని తలపించింది.

Update: 2024-09-24 05:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : చేపల లోడ్ తో వెలుతున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడగా..అందులోని చేపల కోసం స్ధానిక జనం ఎగబడిన తీరు చెరువు లూటీని తలపించింది. ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు చేపల లోడుతో వెళ్తున్న లారీ మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో బోల్తాపడింది. అందులో ఉన్న చేపలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో బతికున్న చేపల (లైవ్‌ ఫిష్‌) కోసం ప్రజలు పోటీపడ్డారు. అందినకాడికి నిమిషాల్లో చేపలన్నింటిని ఎవరి శక్తి మేరకు వారు పట్టుకుని వెళ్ళిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపుచేశారు. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రమాదానికి గురైన లారీని అక్కడి నుంచి తొలగించి.. ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. 


Similar News