ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయం ఇదే..!

కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది.

Update: 2024-06-05 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. 17వ లోక్ సభ రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. లోక్ సభ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో భాగంగా రాష్ట్రపతిని ప్రధాని మోడీ కలిశారు. 17వ లోక్ సభను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరారు. జూన్ 7న ఎన్డీఏ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎన్డీయే సమావేశంలో పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈనెల 8న భారత ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   


Similar News