TG EdCET : నేడు ఎడ్సెట్ ఫలితాలు విడుదల
రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.
దిశ, వెబ్డెస్క్: రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని టీజీ కాలేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఫలితాలనున విడుదల చేయనున్నారు. ఆన్ లైన్ కంప్యూటర్ బేస్ట్ విధానంలో మే 23న పరీక్షను నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎడ్సెట్కు 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. సెషన్ -1లో 16,929 మందికి గానూ 14,633 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సెషన్ -2 లో 16,950 మందికి గానూ 14,830 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.