‘ఇది బీజేపీ కుట్ర.. కలిసి పోరాడదాం రండి..’ జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్

జమిలి ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Update: 2024-09-21 08:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: జమిలి ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జమిలి ఎన్నికల ముసుగులో బీజేపీ (BJP) కుట్ర చేస్తోందని, దేశాన్ని కబళించాలని చూస్తోందని నిప్పులు చెరిగారు. సీపీఎం దివంగత నేత సీతారాం ఏచూరి (Seetaram Yechuri) సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన.. జమిలి ఎన్నికలనుద్దేశించి మాట్లాడారు. దేశంలో జమిలి ఎన్నికల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని, ఇలాంటి సమయంలో ఏచూరి లేకపోవడంతో దేశానికి నష్టం కలుగుతోందన్నారు. అయినా వెనకడుగు వేయకుండా అందరం కలిసి సీతారాం ఏచూరి స్ఫూర్తితో బీజేపీ కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఇటీవలే కేంద్ర క్యాబినెట్ (Central Cabinet) జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కొన్నేళ్ల నుంచి కేంద్రంలోని బీజేపీ కసరత్తు చేస్తోంది. దీనిపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇటీవలే రామ్‌నాథ్ కోవింద్ కమిటీ తయారుచేసిన రిపోర్ట్‌పై కేంద్ర కేబినెట్ సమావేశమైన ఆమెద ముద్ర వేసింది. అలాగే రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్‌ (Parliament)లో ప్రవేశపెడతామని తెలిపింది.


Similar News