ఇండియా గేట్ వద్ద ఘనంగా బోనాల వేడుకలు

ఇండియా గేట్ వద్ద ఘనంగా బోనాల సందడి మొదలైంది.

Update: 2024-07-09 12:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో తెంలగాణ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం ఇండియా గేట్ వద్ద ఘటం ఊరేగింపు వేడుక ఘనంగా జరిగాయి. ఈ బోనాల వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న తెలంగాణ ఆడపడుచులు ఇండియా గేట్ వద్దకు బోనాలు తీసుకువచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, పోతరాజు నృత్యాల నడుమ ఈ వేడుకలో కోలాహలంగా జరిగాయి. కాగా ఆషాడ మాసం ప్రారంభం కావడంతో గత ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News