మీతో కలిసి పని చేసేందుకు సిద్ధం.. కేంద్ర మంత్రి కుమార స్వామిపై దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి కుమార స్వామిపై దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-14 05:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా తమ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జేడీఎస్ సీనియర్ నేత హెచ్ డీ కుమార స్వామికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిగా నియమితులైనందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున మీకు శుభాకాంక్షలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్స్‌లకు టెక్నాలజీకి గేట్‌వేగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే భారతదేశాన్ని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి సంపద, ఉపాధి కల్పనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. పరిశ్రమలకు తెలంగాణను అత్యుత్తమ గమ్యస్థానంగా మార్చేందుకు మా కార్యక్రమాలతో తదుపరి వృద్ధికి మేము మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామన్నారు. ఇందు కోసం మీ సహకారాన్ని కోరుతున్నామని రాసుకొచ్చారు.

Tags:    

Similar News